జంగంపల్లిలో ప్రజలకు సైబర్ మోసాలపై పోలీసుల అవగాహన
యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి గ్రామంలో సీఐ బొడ్డుపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, అనుమానాస్పద లింకులను నమ్మవద్దని తెలిపారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం/క్రెడిట్ కార్డు సమాచారం, ఓటీపీ, పిన్ వంటి వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.
ఆన్లైన్లో పెట్టుబడులు, ఉద్యోగాలు, బహుమతుల పేరుతో జరిగే మోసాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలకు వివరించారు. సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాలను చాలా వరకు అరికట్టవచ్చని సీఐ బొడ్డుపల్లి భాస్కర్ తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
— SN సింహ తెలంగాణ స్టేట్ బ్యూరో


