IND News

క్రిమినల్ మై..నరీ చార్ చోరీ గుట్ట!

SN సింహ క్రైమ్ బ్యూరో

🚨 CRIME SPECIAL STORY 🚨

కొండపై ‘మైనర్’ దొంగల హల్‌చల్..!

గులేరుతో గురి.. కారు అద్దాలు ధ్వంసం.. వరుస చోరీలు!

యాదగిరిగుట్ట:
యాదగిరిగుట్ట కొండపై వరుస దొంగతనాలతో భక్తులను, వాహనదారులను ఆందోళనకు గురిచేసిన ఘటనలో ఓ మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చిన్న వయసులోనే వరుస చోరీలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి.

🎯 గులేరుతో గురి.. అద్దాలు ధ్వంసం!

పోలీసుల వివరాల ప్రకారం, పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపి ఉంచిన కార్లను లక్ష్యంగా చేసుకుని గులేరుతో కారు అద్దాలను ధ్వంసం చేసి, లోపల ఉన్న విలువైన వస్తువులను అపహరించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

భక్తులు స్వామివారి దర్శనం కోసం వెళ్లిన సమయంలో కార్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో కొండపై భక్తుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

🔥 ‘బుడ్డోడే’.. కానీ ఆరోపణలు మాత్రం భారీగా!

చిన్న వయసు.. చిన్న శరీరాకృతి.. కానీ వరుస చోరీల ఆరోపణలు పోలీసులకు సైతం సవాల్‌గా మారినట్లు తెలుస్తోంది. ఈ మైనర్ సుమారు 30 దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

అయితే ఈ సంఖ్యతో పాటు చోరీలకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల అధికారిక ప్రకటనతోనే నిర్ధారణ కావాల్సి ఉంది.

🚨 ఎట్టకేలకు పోలీసుల వలలో!

వరుస ఘటనలపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడి నుంచి చోరీలకు సంబంధించిన వివరాలను పోలీసులు రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనల వెనుక మరెవరైనా ఉన్నారా? మైనర్ ఒంటరిగానే వ్యవహరించాడా? అనే కోణంలోనూ విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.

⚠️ భక్తుల భద్రతపై ప్రశ్నలు!

యాదగిరిగుట్టకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇలాంటి వరుస చోరీలు భక్తుల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. పార్కింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, పోలీసుల నిఘా మరింత పెంచాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

🔴 BIG QUESTION

చార్ చోరీల వెనుక అసలు కథేంటి?

మైనర్ ఒక్కడేనా..? లేక తెర వెనుక మరో ముఠా ఉందా?

పోలీసుల దర్యాప్తులో బయటపడనున్న సంచలన నిజాలేంటి?

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top